Spread the love

వామ్మో యోగా ఇక్కడ

భార‌తీయ వార‌స‌త్వ సంప‌ద అయిన యోగాను ప్ర‌తిఒక్కరికీ చేరువ‌చేయాల‌నే ల‌క్ష్యంతో ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న యోగాంధ్ర‌-2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన బెరం పార్కు వ‌ద్ద కృష్ణమ్మ ఒడిలో యోగా ఆన్ వాట‌ర్ క్రాఫ్ట్- ఫ్లోటింగ్ యోగాతో ప్ర‌పంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు అధికారులు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 21న విశాఖలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ సన్నాహాల్లో భాగంగానే ఈ నెల 11వ తేదీన బెరం పార్కు వ‌ద్ద కృష్ణమ్మ ఒడిలో యోగా ఆన్ వాట‌ర్ క్రాఫ్ట్- ఫ్లోటింగ్ యోగాతో ప్ర‌పంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు అధికారులు. యోగాను ప్ర‌తిఒక్క‌రూ త‌మ జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా అవ‌గాహ‌న క‌ల్పించి ప్రోత్స‌హించేందుకు ప‌డ‌వ‌ల‌పై యోగా మెగా ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు

యోగా విశిష్ట‌త‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ఎంత ముఖ్య‌మో ఇలాంటి మెగా ఈవెంట్ల విష‌యంలో ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. ఈ నేప‌థ్యంలో ఈ వెంట్‌ జరిగే ప్రాంతంలో గ‌జ ఈత‌గాళ్లు, లైఫ్ జాకెట్లు, సుశిక్షితులైన బోట్ ఆప‌రేట‌ర్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. బోట్ల‌ను పరిశీలించి వాటికి ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. నెల రోజుల వ్య‌వ‌ధిలో రెండు కోట్ల మందికి యోగాను నేర్పించే ల‌క్ష్యంతో యోగాంధ్ర‌-2025ను ఇప్పటికే ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు