Spread the love

ఇకపై మహానటి… |

కీర్తి సురేష్ ‌ది. 2016లో ‘నేను శైలజ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ.. నేను లోకల్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, అజ్ఞాతవాసి, రంగ్‌దే, సర్కారు వారి పాట వంటి సినిమాల్లో నటించింది. 2018లో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ‘మహానటి’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం కీర్తి సురేష్ కెరీర్‌నే మార్చేసింది. సహజ నటనతో తెలుగువారికి దగ్గర కావడంతో పాటు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకుంది. అయితే ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన పెద్దగా ఆడకపోవడంతో తమిళ, మలయాళ ఇండస్ట్రీల వైపు ఆసక్తి చూపించింది.

ఇక చాలాకాలం తర్వాత టాలీవుడ్ వైపు చూసిన కీర్తి.. ఇటీవలే ‘ఉప్పు కప్పురంబు’ చిత్రంతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా తెలుగులో ఆమెకు బంపరాఫర్ వచ్చినట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.‘ ‘కింగ్‌డమ్’తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు వస్తోన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దాని తర్వాత ‘ రౌడీ జనార్దన్ ’ అనే చిత్రంలో నటించనున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కోలా రవికిరణ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని తీసుకున్నట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్నా అధికారి ప్రకటన ఇంకా రాలేదు.

‘రౌడీ జనార్దన్’ సినిమాలో కీర్తి సురేష్ వేశ్య పాత్రలో కనిపించనుందన్న వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు పద్ధతిపాటుగా కనిపించిన కీర్తి, ఇటువంటి బోల్డ్ పాత్ర చేస్తుండటం అభిమానులకు షాక్‌గా మారింది. అయితే ఇప్పటివరకు ఈ వార్తపై కీర్తి సురేష్ గానీ, మూవీ యూనిట్ గానీ అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉండగా, నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో కయాదు లోహర్ కూడా వేశ్య పాత్రలో నటిస్తోందని మరో గాసిప్ వినిపిస్తోంది. ఈ రెండు అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.