Spread the love

చిరంజీవి, బాలకృష్ణ తో ఎకైక హీరోయిన్…

చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్ హీరోల సరసన నటించిన ఆమె.. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటింది. దశాబ్దాలపాటు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సుమన్, కృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే లేడీ ఓరియెంటెడ్, మాస్ యాక్షన్ చిత్రాలతో సత్తా చాటింది. అప్పట్లో ఆమెను ఫ్యాన్స్ అంతా లేడీ అమితాబ్ అని పిలుచుకునేవారు. అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును సైతం అందుకుంది. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ హీరోయిన్.. మరెవరో కాదు.. సౌత్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.

వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 19 సినిమాలు.. బాలకృష్ణతో కలిసి 16 సినిమాల్లో పనిచేసింది. అలాగే 1991లో కర్తవ్యం సినిమాలో ఐపీఎస్ అధికారిణి పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమె పేరు మారుమోగింది. ఇందులో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఇందులో వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. విజయశాంతి 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే లేడీ ఓరియెంటెడ్, మాస్ యాక్షన్ చిత్రాలను ఎంచుకుని రిస్క్ చేసింది విజయశాంతి. కానీ ఆ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాశాయి. చాలా సంవత్సరాలపాటు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో కొనసాగింది విజయశాంతి. కానీ 2020లో మహేష్ బాబు,రష్మిక మందన్నా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన సన్నాఫ్ వైజయంతి సినిమాలో కీలకపాత్రలో కనిపించింది.