చలికాలములో నిమ్మకాయ నీళ్లు తాగవచ్చా
నిమ్మకాయ నీళ్లు రుచికి బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే.. చాలా మంది ఈ నీటిని తాగుతూ ఉంటారు. అంతెందుకు ప్రతిరోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకొని కూడా తాగుతూ ఉంటారు. అసలు చలికాలంలో నిమ్మకాయ నీరు తాగడం మంచిదేనా? జలుబు చేసే అవకాశం ఏమైనా ఉందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం….

చలికాలంలో కూడా నిమ్మకాయ నీరు తాగడం శరీరానికి మేలు చేస్తుందని, రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ ఈ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లిపోవడానికి సహాయపడతాయి. అంతేకాదు… జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజంతా శరీర శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా, చలికాలంలో జీవక్రియ మందగించినప్పుడు, గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకొని తాగడం వల్ల శరీర అంతర్గత వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి.

గోరు వెచ్చని నీటితో కలిపిన నిమ్మరసం తాగడం వల్ల జీవక్రియ వేగవంతంగా పని చేస్తుంది. ఈ నిమ్మకాయలో లభించే సిట్రిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది. పరగడుపున తాగితే… ఎక్కువ ఫలితాలు వస్తాయి.
రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి…
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి, మన రోజువారీ ఆహారంలో నిమ్మకాయను సరైన మొత్తంలో చేర్చుకోవడం వల్ల జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

నిమ్మకాయ పానీయం ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే ఇది మూత్రం ద్వారా శరీరం నుండి టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది, ఇది జీర్ణవ్యవస్థను సరిగ్గా పనిచేయడానికి మాత్రమే కాకుండా, చర్మం కాంతిని కూడా పెంచుతుంది. ముఖ్యంగా ముఖంపై ముడతలు రాకుండా, మొటిమలను తగ్గించడంలోనూ సహాయపడతాయి.
బిపిని కంట్రోల్ చేయడానికి….
నిమ్మకాయలలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది డయాబెటిక్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు నిమ్మకాయ పానీయం (చక్కెర జోడించకుండా) తీసుకోవాలి.
