మొటిమలు తోవచ్చిన మచ్చలకు చెక్ పెట్టండి ఇలా…|

అత్యంత కామన్ గా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు(Pimples) ఒకటి.
అయితే కొందరికి మొటిమల వల్ల ముఖంపై నల్లటి మచ్చలు(Dark spots) ఏర్పడుతుంటాయి.ఈ మచ్చలను పోగొట్టుకునేందుకు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు.
ఈ రెమెడీతో సులభంగా స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు రెబ్బలు వేపాకు(Neem) మరియు పావు కప్పు ఫ్రెష్ గా చెట్టు నుంచి తీసిన అలోవెరా జెల్(aloe vera gel) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు(turmeric), వన్ టీ స్పూన్ శనగపిండి(gram flour), వన్ టీ స్పూన్ ముల్తానీ మట్టి (multani mitti)వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే ముఖంపై మొటిమల తాలూకు మచ్చలే కాదు ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా క్రమంగా మాయమవుతాయి.
