Spread the love

మాస్ మహారాజా రవితేజ సరసన ఒకే ఒక్క సినిమాలో కనిపించింది. కట్ చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది

తెలుగు సినీరంగంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే పాపులర్ అయ్యింది. కానీ ఆ తర్వాత అదే క్రేజ్ కొనసాగించలేకపోయింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆ హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఆమె మరెవరో కాదు.. శియా గౌతమ్. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు.. కానీ మాస్ మహారాజా రవితేజ నటించిన నేనింతే సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2008లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కానీ ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో రవితేజ యాక్టింగ్, పూరీ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

తెలుగులో కేవలం నేనింతే సినిమాలో నటించింది. బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన సంజూ చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా సైతం హిట్ కాలేదు. దీంతో అక్కడ సైతం ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.

రవితేజ సరసన నేనింతే సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన శియా.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.